చైనా అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామాన్నే నిర్మించిన ఇప్పుడు సిక్కిం రాష్ట్రంలోకి కూడా చొరబడేందుకు ప్రయతినిస్తుంది. చైనా బలగాలు పైకి శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు సిక్కింలోని నాకు లా కనుమ వద్ద భరత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. భారత సైన్యం ముందుగా తెలుసుకొని చైనా ని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినాయి ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారు.
ఈ ఘర్షణలో చైనా సైన్యానికి చెందిన 20 మంది, నలుగురు భారత సైనికులు గాయపడ్డారని పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ వెల్లడించింది. ఇప్పటికే తూర్పు లడఖ్లోని పాంగాంగ్ త్సో, గాల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్ తదితర ప్రాంతాల్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణలు ఏర్పడగా, అంతకు ముందు ఇదే సరిహద్దు వద్ద కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 2017లో డోక్లాం వద్ద భారత్, చైనా బలగాలు 73 రోజులపాటు యుద్ధ సన్నాహకాలు చేశాయి.